స్టార్ క్యాంపైనర్ గా తెలంగాణకు రానున్న తమిళ్ సై

స్టార్ క్యాంపైనర్ గా తెలంగాణకు రానున్న తమిళ్ సై

ముద్ర, సెంట్రల్ బ్యూరో: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. గతంలో ఇక్కడ గవర్నర్ గా పనిచేసిన ఆమె ఇప్పుడు మాత్రం భారతీయ జనతపార్టీ స్టార్ క్యాంపెయినర్ గా తమ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఎన్నికల సంఘానికి బీజేపీ ఇచ్చిన 40 మంది స్టార్ కాంపెయినర్ల జాబితాలో తమిళ్ సై పేరు కూడా ఉంది. ఆమెతో పాటు అన్నామలై, కుష్బూ సుందర్, రాధిక శరత్ కుమార్, తేజస్వి సూర్య, రాజాసింగ్, యోగి ఆదిత్యనాథ్, నిర్మలా సీతారామన్ పేర్లను తెలంగాణ స్టార్ క్యాంపెయినర్లుగా రానున్నారు. ఇలా 40 మందితో కూడిన జాబితాను ఎన్నికల సంఘానికి బీజేపీ అందించంది.